బాలుడు కిడ్నాప్ వాస్తవం కాదు…డీఎస్పీ ఆర్ శ్రీహరి బాబు..

బాలుడు కిడ్నాప్ వాస్తవం కాదు…డీఎస్పీ ఆర్ శ్రీహరి బాబు..
గుంటూరు జిల్లా గురజాల….మాచర్ల లోని నెహ్రు నగర్ కు చెందిన భూక్యా సాయి సాత్విక్(సిద్దు) ను కిడ్నాప్ చేశారని వస్తున్న వార్తలు నిజం కాదని డీఎస్పీ తెలిపారు. బాలుడు కనిపించటం లేదు అని తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్త మై జిల్లాలోని అన్ని బస్ స్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా గుంటూరు రైల్వే స్టేషన్ లో అనుమానం గా ఉండటంతో విచారణ జరిపి బాలుడు తల్లిదండ్రులను తీసుకెళ్లి చూపించగా ఆ బాలుడు కాదని సమాధానం చెప్పారు. కాని అన్ని ప్రసార మాధ్యమాల్లో కిడ్నాప్ కు గురైనట్లు వస్తున్నాయని అది నిజం కాదని బాలుడు కిడ్నాప్ కాలేదని, ఇంటి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో గురువారం బాలుడు మృతి చెంది కనిపించాడు అని డీఎస్పీ తెలిపారు. ఎవరు భయబ్రాంతులకు గురికావద్దని ప్రజలకు సూచించారు.

About The Author