డీజిల్‌ కార్లకు మారుతీ మంగళం…

అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి డీజిల్‌ వెర్షన్‌ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్‌6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్‌ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్‌ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్‌ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్‌ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్‌ వెర్షన్‌లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి. కేవలం డీజిల్‌ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్‌ నుంచి కంపెనీ ఎల్‌సీవీ సూపర్‌ క్యారీ డీజిల్‌ వెర్షన్‌ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్‌జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్‌ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్‌1 నుంచి మేము డీజిల్‌ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్‌ ఆర్‌సీ

About The Author