పురుషులలో మాత్రమే వచ్చే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను మందుతో…

పురుషులలో మాత్రమే వచ్చే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను “పార్ట్‌ ప్రోటీన్‌” అనే మందుతో సమర్ధవంతంగా నిరోధించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు భారతీయ యువ శాస్త్రవేత్త ” కరి విజయలక్ష్మి ” మన తెలుగమ్మాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా “ఇంకొల్లు” కు చెందిన విజయలక్ష్మి జర్మనీలోని “గొటిజెన్‌ యూనివర్సిటీ” లో ఎపి జెనిటిక్స్‌ డిఎన్‌ఎ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు.

ప్రొఫెసర్‌ స్టీవ్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో చేస్తున్న పరిశోధనల్లో ,క్యాన్సర్‌ వ్యాధుల్లో ఒకటైన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను పార్ట్‌ ప్రోటీన్‌తో తగ్గించొచ్చని తేల్చారు.

ఈ పాటికే ఈ వ్యాధి వచ్చిన వారు పలువురు ఈ మందు వాడిన తర్వాత నూటికి నూరు శాతం ఫలితం కన్పించిందని ఆమె తెలిపారు.

ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల శాస్త్రవేత్తల పరిశోదనలూ, ప్రయోగాల ఫలితాలు వెలువరించే ఎంబో రిపోర్ట్స్‌ అనే పత్రికతో పాటు, జర్మనీకి చెందిన హెచ్‌ఎన్‌ఎ అనే ప్రముఖ దినపత్రికలో కథనం వెలువడింది.

About The Author