మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ భార్య కన్నుమూత…


భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ భార్య కన్నుమూశారు. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి అహ్మదాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భగవతిని అహ్మదాబాద్ #ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే ఈరోజు ఆమె కన్నుమూశారు….

భగవతి తన భర్త కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లో నివసిస్తూ ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవిస్తుంటారు. ఆయనకు రాజకీయాలతో సంబంధాలు లేవు. ఆయన దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు.
ఇటీవల నవంబరులో ఆయన హైదరాబాద్ కూడా ఈ పని మీదనే వచ్చారు. సంగారెడ్డిలోని శ్రీవైకుంఠపురంలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. #బండ్లగూడలోని శ్రీ శారదాధామంలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. తల్లిపాలతోనే తమకింతటి జ్ఞాపకశక్తి, ఆరోగ్యం వచ్చాయనీ, ఆర్‌ఎస్‌ఎస్ వల్లనే క్రమశిక్షణ, దేశభక్తి అలవడ్డాయని ఆయన ఆ సందర్భంలో పేర్కొన్నారు..
భగవతి మరణంతో మోదీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి….

About The Author