మోదీ పై పోటీకి సై అంటున్న మానవ్… వారణాసి బరిలో విశాఖ వాసి…


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక వారణాసి లోక్‌సభ స్థానం నుంచి విశాఖ జిల్లా జోడుగులపాళెం వాసి మానవ్ దాఖలు చేసిన నామినేషన్ ను ఆమోదించారు అక్కడి రిటర్నింగ్ అధికారి…

వారణాసి నుంచి మోదీ పై పోటీ చేసి, తమ నిరసనను తెలపడానికి 25 మంది నిజామాబాద్ పసుపు రైతులతోపాటు, నలుగురు తమిళనాడు రైతులు నామినేషన్‌ దాఖలు చేయగా… వారిలో ఒక్కరి నామినేషన్ ను మాత్రమే రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. అయితే విశాఖకు చెందిన 31 ఏళ్ల మానవ్‌ వేసిన నామినేషన్‌ను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి అన్ని సరిగ్గానే ఉండడంతో ఆమోదించారు. కుల, మతాల ప్రస్తావన లేకుండా కనీసం ఇంటి పేరు సైతం లేకుండా మానవ్‌ నామినేషన్‌ దాఖలు చేయడం విశేషం..

About The Author