అరకు ఎమ్మెల్యే హత్యా నిందితురాలి ఎన్‌కౌంటర్…

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకేసులో కీలక నిందితురాలు స్వరూప అలియాస్ కామేశ్వరి హతమైంది.

ఒడిషాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతిచెందినట్లు సమాచారం. కిటుబకంటి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు, వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇందులో స్వరూప అలియాస్ కామేశ్వరి చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.వీరి వద్ద నుంచి 3 ఎస్‌ఎస్‌ఆర్‌, 2 ఇన్సాస్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా మావోలు అడ్డగించి హత్యచేసిన విషయం తెలిసిందే…

About The Author