విశాఖ కైలాసగిరి లో విషాదం… సిక్కోలు ప్రేమ జంట ఆత్మహత్యా యత్నం…


విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది… వీరిని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన సీహెచ్‌.సత్యనారయణ, రౌతు కమలగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం…ఆదివారం ఉదయం కైలాసగిరికి చేరుకున్న ప్రేమికులు తమ వెంట తెచ్చుకున్న క్రిమి సంహారకమందును బాదం పాలులో కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా.. కమల పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

About The Author