అనిశా కు చిక్కిన విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్…

విజయనగరం జిల్లా తెర్లాం APEPDCL సహాయ ఇంజనీర్ గొటివాడ రామారావు, అతని పరిధిలోని లైన్‌మెన్ ఎమ్.వి సత్యనారాయణలు పదివేలు లంచం తీసుకొంటుండగా విజయనగరం రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

మరదాన రమణ అనే వ్యక్తి తన వ్యవసాయ పంపునకు పవర్ కనెక్షన్ ఇవ్వాలని కోరగా… అందుకు పదివేల లంచం డిమాండ్ చేసారు సహాయ ఇంజనీర్ మరియు లైన్‌మెన్… ఇదే విషయాన్ని సదరు మరదాన రమణ ఏసీబీ అధికారులకు తెలుపగా… వారు కెమికల్ పూత కలిగిన నోట్లను లంచం ఇవ్వడానికి రమణకు ఇచ్చారు.

13-05-2019 మధ్యహ్నం ఒంటి గంట ప్రాంతంలో సహాయ ఇంజనీరు ఆఫిసుగదిలో రామారావుకు ఆ మొత్తాన్ని ఇవ్వగా… తను లెక్కించవలసిందిగా లైన్‌మెన్ కు ఇచ్చారు. ఘటనా స్థలంలో మాటువేసిన అనిశా అధికారులు దాడిచేసి నిందితులు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

లంచంగా తీసుకొన్న డబ్బును, సంబంధిత రికార్డులను అధికారులు సీజ్ చేసారు.

About The Author