ఖరారైన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ టూర్ షెడ్యూల్…

 

దేశ ప్రథమ పౌరుడి రెండురోజుల ఏపీ పర్యటన… ఖరారైన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ టూర్ షెడ్యూల్…

ఈ నెల 19,20 తేదీలలో… భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.

19 వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొంటారు రాష్ట్రపతి.

అదే రోజు గుటూరు లోని ‘లాం’ ఫాం లో ఉన్న ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే కారగయక్రమానికి హాజరై అక్కడి శాస్త్రవేత్తలు, అధకారులను కలుస్తారు.

గుంటూరు నుంచి నేరుగా ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ చేరుకొంటారు రాం నాథ్ కోవింద్… మరుసటిరోజు అనగా 20వ తేదీన స్వర్ణభారతి ట్రస్ట్ లో ‘ఒంగోలు జాతి పశుసంపద పై పుస్తకావిష్కరణ చేస్తారు.

సాయంత్రం ఆరు గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, వాయుసేన ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళనున్నారు.

About The Author