సీఎం శ్రీ కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల…

సీఎం శ్రీ కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి కి వెెళ్లారు. మరికాసేపట్లో రేణిగుంట విమానాశ్రయం లో దిగనున్నారు. సిఎం కెసిఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు వైసిపి ఎంఎల్ఏ లు ఎయిర్ పోర్ట్ లో వేచి చూస్తున్నారు. రాత్రి అక్కడే బసచేసి సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం స్థానిక నేతలతో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు. తిరిగి సోమవారం సాయంత్రం కెసిఆర్‌ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరు తారు.

About The Author