తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరిన జగన్…


ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన.. సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్ఛాలను స్వీకరించారు.

అనంతరం రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వైఎస్‌ జగన్‌ తిరుమలకు బయలుదేరారు. ఆయన రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరనున్నారు.

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి కడప చేరుకోనున్నారు. కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్‌ను సమర్పించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాపర్‌ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు.

పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.

తిరుమల చేరుకున్న వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆయనకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేతృత్వంలోని అధికారుల బృందం సాదర స్వాగతం పలికారు..‌

మరోవైపు జగన్ కోసం వేచి ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

వైఎస్‌ జగన్‌ రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం కుటుంబసమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరనున్నారు.

About The Author