మోదీకి స్వయంగా మిఠాయి తినిపించిన మాజీ రాష్ట్రపతి….


సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ… పార్టీ సీనియర్లను స్వయంగా కలుస్తున్న సంగతి తెలిసిందే…

భారత మాజీ రాష్ట్రపతి, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ప్రణబ్ ముఖర్జీ ని ఆయన నివాసంలో నేటి ఉదయం మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు… ఈ సందర్భంగా మోదీకి ఆత్మీయ ఆహ్వానం పలికిన ప్రణబ్… ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ… స్వయంగా మిఠాయి తినిపించారు.

ప్రణబ్‌ దాదాను కలిసిన ప్రతీసారి ఓ మహోన్నత అనుభూతి ని పొందుతాను, ఆయన పరిజ్ఞానం, ప్రావీణ్యం అసమానమైనవి. ఆయన ఒక గొప్ప రాజనీతజ్ఞుడు. ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. ఈ రోజు ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను’ అంటూ… మోదీ ట్వీట్ చేసారు.

About The Author