రంజాన్ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు జూన్ 2 వ తేదిన ఇఫ్తార్ విందు…

రంజాన్ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు జూన్ 2 వ తేదిన ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎ.కే.ఖాన్ బుధవారం ఎల్ బి స్టేడియంలో మైనారిటీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. డయాస్ ఏర్పాటు, నమాజ్ చేయడానికి ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పి.ఏ సిస్టమ్ ఏర్పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా,ప్రోటోకాల్,ఆహ్వాన పత్రికల పంపిణీ, సానిటేషన్,త్రాగునీరు, లైటింగ్ తదితర ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించారు. అన్ని ఏర్పాట్లు ఒక రోజు ముందే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, అడిషనల్ కమీషనర్ లా అండ్ ఆర్డర్ డి.ఎస్ చౌహాన్, టి.ఎస్ హజ్ కమిటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.ఎ వాహిద్, మైనారిటి వెల్ఫేర్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, సమాచార శాఖ అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.

About The Author