పెళ్లి చేసిన పూజారితో లేచిపోయిన పెళ్లికూతురు…

పెళ్లి చేసిన పూజారితో లేచిపోయిన పెళ్లికూతురు…
రెండు వారాలకే డబ్బు ,నగలతో ఉడాయించింది…

ఓ యువతి పెళ్లైన రెండు వారాలకే తనకు వివాహం జరిపించిన పంతులుతో వెళ్లిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అసత్‌ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 7న వివాహం జరిపించారు. వీరి పెళ్లిని ఇదే ప్రాంతానికి చెందిన వినోద్‌ మహారాజ్‌ అనే పురోహితుడు జరిపించారు. పెళ్లయిన మూడో రోజే పుట్టింట్లో కొన్ని రోజలు ఉండి వస్తానని చెప్పి వెళ్లింది. ఈ నేపథ్యంలో అసత్‌ ప్రాంతంలో మరో వివాహం జరిపించాల్సి ఉండటంతో ఈ వేడుకకు వినోద్‌నే పిలిపించారు.
ఈ పెళ్లి తంతును జరిపించిన తర్వాత వినోద్‌, ఆ యువతి కనిపించకుండా పోయారు. వివాహిత ఇంటి నుంచి రూ.15 లక్షలు విలువ చేసే బంగారం, రూ.30వేల నగదు కూడా పట్టుకుపోయింది. దాంతో వినోదే ఆమెను తీసుకెళ్లిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహితుడైన వినోద్‌కు ఇద్దరు పిల్లలు. రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

About The Author