కేంద్ర కేబినెట్ లో తెలంగాణ బెర్త్ కన్ఫాం…


కిషన్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి…?

కిషన్‌ రెడ్డికి ప్రధాని ఆఫీస్‌ నుంచి ఫోన్‌…

ఊహించినట్లే తెలంగాణ బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్న ఎంపీలకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్లు వెళుతున్నట్టు సమాచారం‌

మరికొందరికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. కిషన్‌ రెడ్డికి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చినట్లు పార్టీ వర్గాలు, సన్నిహితులు ధృవీకరించారు.

మరోవైపు అమిషా నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని బీజేపీ ఎంపీ నరేంద్ర సింగ్‌ తొమార్‌ మీడియాకు తెలిపారు.

ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో… 8000 మంది ప్రత్యేక ఆహ్వానితులకోసం నేటి రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేయనున్నారు.

About The Author