ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాయింట్స్…

రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పిన జగన్. కేసీఆర్ స్టాలిన్ కు అభినందనలు చెప్పిన జగన్. పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను.3648 కిలోమీటర్ల పాదయాత్ర లో ప్రజల కష్టాలు చూసాను,విన్నాను. అందరి ఆశలు,ఆకాంక్ష లు పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతాను. 2 పేజీల మ్యానిఫెస్టో తీసుకువచ్చను. గత ప్రభుత్వం మాదిరి పేజీలు పేజీలు మ్యానిఫెస్టోలు తీసుకురాలేదు. మ్యానిఫెస్టోని ఖురాన్,బైబిల్,భగవత్ గీతగా భావిస్తాను. పెన్షన్లు పెంపు తొలి సంతకం. పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగా పెన్షన్లు 3వేలు ఇస్తున్నాను. జూన్ నుంచి 2250 ఇస్తున్నాం. వైస్సార్ పెన్షన్ గా అందిస్తున్నాను. పెన్షన్లు పెంపు అంశంపై తొలిసంతకం చేసిన జగన్. వచ్చే ఏడాది 2500. ఆతరువాత 2750. ఆతరువాత 3000 పెన్షన్లు ఇస్తాం. నవరత్నాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన చేస్తాం. అవినీతి కి పాల్పడిన వారిపై చర్యలు. టెండర్లలో అవినీతి జరిగినట్లు తెలిస్తే రివర్స్ టెండర్లు అమలు చేస్తాం. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కరెంట్ యూనిట్ ఖరీదు 2.50పైసలు ఉంటే మన రాష్ట్రంలో 4రూపాయలు వసూలు చేస్తున్నారు. వ్యవస్థ లో ప్రక్షాళన చేయడంతో పాటు పారదర్శక పాలన తెస్తాం. జ్యూడిషియల్ కమీషన్ ద్వారా టెండర్లు పిలుస్తాం. 6నెలల నుంచి సంవత్సర కాలంలో వ్యవస్థ లో మార్పులు తెస్తాం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం – ముఖ్యాంశాలు:

– వైయస్‌ జగన్‌ అనే నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నాను.

– 3648 కి.మీ ఈ నేల మీద నడిచినందుకు, గత 9 ఏళ్లుగా మీలో ఒకరిగా నిల్చినందుకు.. ఆకాశమంత విజయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

– వేదిక మీద ఉన్న పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారికి, పక్కన తమిళనాడులో రేపు సీఎంగా ప్రమాణం చేయాలని ఆకాంక్షిస్తూ స్టాలిన్‌ గారికి..

– ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరునా నమస్సుమాంజలి.

– 10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3648 కి.మీ పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను.

– పేదలు, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు చూశాను. వాటిని విన్నాను. అవన్నీ చూశాక, ఈ వేదికపై నుంచి మీ అందరికీ ఒక సీఎంగా మాట ఇస్తున్నాను.

– మీ కష్టాలు విన్నాను. బాధలు చూశాను. నేను ఉన్నాను.
– అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ, మేనిఫెస్టో కేవలం రెండు పేజీలతో ప్రజలకు ఎప్పుడు గుర్తుండే విధంగా తీసుకువచ్చాము.

– గత పాలకుల మాదిరిగా పేజీలకొద్ది మేనిఫెస్టో తీసుకురాలేదు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టలేదు. ఎన్నికల తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే విధంగా పుస్తకం తేలేదు.

– మేనిఫెస్టో అంటే, ఎన్నికైన తర్వాత ఏం చేస్తామన్నది ప్రజలకు అనుక్షణం గుర్తుండాలి, అందుకే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో ప్రకటించాను.

– మీ అందరి కళ్ల ముందు పెట్టాను. అందులో ప్రతి అంశాన్ని అమలు చేస్తాను. మేనిఫెస్టో ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీత.
– మేనిఫెస్టోలోని అంశాలు ఒక ఊపిరిగా ఈ 5 ఏళ్లు పని చేస్తాను.

– మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలలో ఇవాళ ఒకటి నేను ఇక్కడ వివరిస్తాను.

– అవ్వా తాతలకు ఇస్తున్న పెన్షన్‌ మరో రూ.250 పెంచుతూ తొలి సంతకం పెడుతున్నాను.

– ఈ జూన్‌ నుంచే అవ్వా తాతల పెన్షన్‌ పెరుగుతుంది. వారికి రూ.2250 వైయస్సార్‌ పెన్షన్‌ వస్తుంది.

– వచ్చే ఏడాది రూ.2500, ఆ తర్వాత ఏడాది రూ.2750, ఆ తర్వాత ఏడాది రూ.3 వేల పెన్షన్‌ ఇస్తాము. ఆ విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను.

– నవరత్నాలులో చెప్పిన ప్రతి అంశం.. ప్రతి ఒక్కరు, ప్రతి పేదకు అందాలి. కులం, మతం, రాజకీయం, పార్టీలకు అతీతంగా అవి అందరికీ అందాలి.

– అందుకోసం వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రావాలి.
– ఆ ప్రక్రియలో ఆగస్టు 15 నాటికి.. అన్ని గ్రామాల్లో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము.

– ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేస్తాము. లంచాలు లేని పరిపాలన దిశలో అడుగులు వేస్తూ.. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాము.

– సేవా దృక్పథం ఉన్న యువతను ఎంపిక చేసుకుని వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాము.

– ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా అందకపోయినా, లంచాలు చోటు చేసుకున్నా వెంటనే ఫిర్యాదు చేయడానికి ఆగస్టు 15 నాటికి సీఎం ఆఫీసులో ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాము.

– పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చే విధంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆ విధంగా ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాము.

– ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయి. ఆ విధంగా 1.60 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.

– ప్రజలకు ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేస్తే, 72 గంటల్లో మంజూరు చేస్తాము.

– ఇవాళ గ్రామాల్లో ఏ పని కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. అందుకే వ్యవస్థలో మార్పు చేస్తున్నాము.

– ఏపీ సీఎంగా 6 కోట్ల మంది ప్రజలకు ఈ వేదిక నుంచి మరో హామీ ఇస్తున్నాను.

– అవినీతి, వివక్ష, లంచాలకు తావు లేకుండా పాలనలో ప్రక్షాళన చేస్తాను. పై నుంచి కింది స్థాయి వరకు అన్ని మార్పులు చేస్తాను.

– ఎక్కడ, ఏయే పనుల్లో, కాంట్రాక్ట్‌ పనుల్లో అవినీతి జరిగిందో.. వాటన్నింటిని రద్దు చేస్తాను.

– ఆ తర్వాత నిబంధనలు మారుస్తూ.. ఎక్కువ మంది బిడ్‌ వేసేలా.. రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెస్‌ అమలు చేస్తాము. వాటికి సంబంధించి అన్ని వివరాలను మీ ముందు పెడతాను.

– రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఎక్కువ మంది బిడ్‌ వేసేలా చేస్తూ.. ఆ విధంగా చేయడం వల్ల ఎంత మిగిలింది? ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది? అన్నది పూర్తిగా ప్రజల ముందుంచుతాను.

– ఇవాళ రాష్ట్రంలో అవినీతి విశృంఖలంగా పెరిగింది.
ఉదా: కరెంటు కొనుగోలు. సోలార్‌ పవర్, విండ్‌ పవర్‌ను ఇతర రాష్ట్రాలలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.2.65, రూ.3 కు కొంటుంటే, ఈ ప్రభుత్వం విండ్‌ పవర్‌ యూనిట్‌కు రూ.4.84 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇంకా పీక్‌ అవర్‌లో యూనిట్‌ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

– వాటన్నింటినీ మీ ముందు పెట్టి, ఆ ఛార్జీలను తగ్గిస్తాను.

– వ్యవస్థలో పారదర్శకత తెస్తాము. ప్రక్షాళన చేస్తాము.
కాంట్రాక్ట్‌ విధానంలో పూర్తి మార్పు చేస్తాము.

– ప్రత్యేకంగా జ్యూడీషియన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తాము. ప్రతి టెండర్‌ను ఆ కమిషన్‌ ముందుంచుతాము. కమిషన్‌ అనుమతి ఇచ్చాకే కాంట్రాక్ట్‌ల కోసం టెండర్లు పిలుస్తాము.
– ఇవాళ ఇక్కడ మీడియా పక్షపాత ధోరణితో పని చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వాళ్లకు చంద్రబాబు మాత్రమే సీఎంగా కనిపిస్తారు.
– చంద్రబాబు ఏం చేసినా మంచే కనిపిస్తుంది. ఇతరులు సీఎంగా ఉంటే, ఎలా
దింపాలని చూస్తారు. వారికి ఇవాళ ఒకటే చెబుతున్నారు.
– టెండర్ల ప్రక్రియను, వాటిలో మార్పులను వారికి కూడా చూపుతాము. అయినా వాటిని వక్రీకరిస్తే, పరువు నష్టం దావా వేస్తాము.
– 6 నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వండి. వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని మాట ఇస్తున్నాను.
– పై నుంచి కింది స్థాయి వరకు ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేస్తాను.
– ప్రజలు దేనికీ దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ అందిస్తాము.
– కులం, మతం, రాజకీయం, ప్రాంతం, పార్టీ, వర్గం.. ఏదీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ అందిస్తానని హామీ ఇస్తున్నాను.

About The Author