ఏపీ సీఎంవో లో మొదలైన అధికారుల బదిలీలు…


ఏపీ సీఎంవో లో మొదలైన అధికారుల బదిలీలు… సమూల ప్రక్షాళనకు సీఎం ఆదేశం…

నిన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీచేసి, తదుపరి పోస్టింగ్ లకోసం సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాల్సిందిగా… ప్రభుత్వ పధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేసారు.

బదిలీ అయిన వారిలో… ముఖ్యమంత్రి కి ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న, 1986బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, సీఎం ముఖ్య కార్యదర్శి, 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్, సీఎంఓ కార్యదర్శులు ఎమ్.గిరిజా శంకర్, ఎ.వి.రాజమౌళి లు ఉన్నారు..

ఆంద్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న, 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి ని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ… సీఎస్ ఎల్వీ మరో ఉత్తర్వును జారీచేసారు.

పై ఉత్తర్వులు అన్నీ తక్షణం అమలులోకి వస్తాయని తన ఉత్తర్వులలో పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

About The Author