ముర‌ళీమోహ‌న్‌ను చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌…

ఇటీవల వెన్నెముక‌కు సంబంధించిన శ‌స్ర్త‌చికిత్స చేయించుకున్న రాజమండ్రి మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌ని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు, టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు.

సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ముర‌ళీమోహ‌న్ నివాసానికి వెళ్లి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ హాస్పిట‌ల్ వైద్యులు స‌ర్జ‌రీ విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నార‌ని ముర‌ళీమోహ‌న్ వారికి వివ‌రించారు. రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ని తెలిపారు మురళీమోహన్.

వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని, పూర్తిగా న‌య‌మ‌య్యేవ‌ర‌కూ విశ్రాంతి తీసుకోవాలన్నారు చంద్ర‌బాబు.

About The Author