రంజాన్ రోజు కోటీశ్వరుడు అయిన ఎన్నారై..

షార్జా: షార్జాలో డిజైనర్‌గా పనిచేస్తున్న ఎన్నారై సంజయ్‌నాథ్‌కు 18 కోట్ల అబుధాబీ లాటరీ వరించింది. ఈ ఏడాది రంజాన్‌ తనకు మర్చిపోలేని రోజని కేరళకు చెందిన సంజయ్‌ చెబుతున్నారు. మే చివర్లో తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్‌ను కొన్న సంజయ్ ఆ తరువాత టికెట్ ఫలితాల గురించి పట్టించుకోలేదు. తన స్నేహితులు లాటరీ విజేతల గురించి పరిశీలించగా.. అందులో తమ స్నేహితుడు సంజయ్ కోటి దిర్హామ్‌లు(రూ. 18 కోట్లు) గెలుపొందినట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని చెప్పడానికి సంజయ్‌కు ఫోన్ చేయగా.. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో మెసేజ్‌లు పెట్టారు. కొద్దిసేపటి తరువాత సంజయ్ ఫోన్ ఆన్ చేయగా.. పదుల సంఖ్యలో మెసేజ్‌లను చూసి ఆశ్చర్యపోయాడు. తాను రూ. 18 కోట్లు గెలుచుకున్నాననే మెసేజ్ చదివిన సంజయ్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ విజయం వల్ల తన జీవితంలో పెద్ద మార్పులు రావని, ఇప్పటివరకు ఎలా ఉన్నానో ఇకపై కూడా అలానే జీవిస్తానని చెప్పారు. ప్రైజ్ మనీని తన స్నేహితులతో కలిసి పంచుకుంటానని, సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని తెలిపారు.

About The Author