వైఎస్ జగన్ సర్కార్‌కు మరో గిఫ్ట్‌…


వైఎస్ జగన్ సర్కార్‌కు మరో గిఫ్ట్‌: అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే కోసం నిధులు

న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మరో కానుకను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి రాజధాని అమరావతికి అనుసంధానిస్తూ నిర్మించ తల పెట్టిన ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించింది. మొత్తం 23 వేల 300 కోట్ల రూపాయలను తొలిదశలో కేటాయించినట్లు తెలుస్తోంది.

1
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా 20 వేల కోట్లు
దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణానికి తన శాఖకు లక్షా 20 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని కోరుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

About The Author