వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి…


చిత్తూరు జిల్లా. పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ గ్రామంలో రమ్య (19సం..)అనే వివాహిత వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి,రేణిగుంట వినాయకనగర్ కు చెందిన రమేష్ ,జయలక్ష్మి కుమార్తె రమ్యను పూతల పట్టు రంగంపేట క్రాస్ ఈశ్వర్(23సం..) కు సంవత్సరం క్రితం వివాహం జరిగింది,రమ్య తల్లిదండ్రులు అయిదు లక్షల కట్నం, ముప్పై స్వరాలు బంగారు ఇచ్చినారు,గత కొద్ది రోజులుగా అత్తింటి వారు రమ్యను అధిక కట్నం వేధిస్తుంటే రమ్య తల్లిదండ్రులు గత రాత్రి అత్తవారింటికి వచ్చి మరల పది సవరాలు బంగారు సమర్పించారు,తెల్లవారేసరికి తన కూతురు మరణ వార్త విని తల్లిదండ్రులు బోరును విలపిస్తున్నారు, తమ కుమార్తెె ను అత్తింటి వారే అధిక కట్నం కోసం ,ఈశ్వరికి మరో వివాహం చేయాలని కుట్రతో తమ కుమార్తెను హత్య చేశారని పూతల పట్టు పోలీసు వారికి ఫిర్యాదు ,తదనంతరం చిత్తూరు డీఎస్పీ రామాంజనేయులు సంఘటన స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author