యాదాద్రికి చేరుకున్న జయవిజయుల విగ్రహాలు…


యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం ప్రధానాలయంలో ప్రతిష్టించే ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలను యదాద్రికి చేర్చారు. ఇట్టి విగ్రహాలను తిరుపతి నుండి భారీ వాహనంలో తీసుకు వచ్చినట్లు యాదాద్రి ముఖ్య స్థపతి డాక్టర్ ఆనంద చారి వేలు తెలిపారు. అనంతరం జయవిజేయులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలోనే ఈ విగ్రహాలను ప్రధానాలయములో ప్రతిష్ట చేయనున్నట్లు ఆయన తెలిపారు

About The Author