తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..


తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది.

ఉన్న నిర్మాణాలను వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇరుంమంజిల్ భవనం, హెరిటేజ్ భవనం, చారిత్రాత్మక భవనాన్ని కూల్చడానికి కారణాలేంటని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్స్… నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలని కోర్టు ఆదేశించింది.

About The Author