విశాఖలో రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన!

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు.

రాజ్‌నాథ్‌ పర్యటన పూర్తిగా నౌకాదళ ప్రధాన స్థావరంతో పాటు వివిధ యూనిట్ల సందర్శన, నౌకాదళ అధికారులతో భేటీకి మాత్రమే కేటాయించారు.

ఈ ఉదయం దిల్లీ నుంచి ఐఎఎఫ్‌కి చెందిన ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ వైమానికి స్థావరానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ ఎకేజైన్‌ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ హెలికాప్టర్‌లో విహంగ వీక్షణం ద్వారా వివిధ యూనిట్లను పరిశీలించారు.

ఈ సాయంత్రం నౌకాదళ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం విశాఖ రానున్న సీఎం జగన్‌ నేరుగా రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.

అనంతరం నౌకాదళ అధికారుల విందులో ఇరువురూ పాల్గొననున్నారు.

రేపు కూడా ప్రత్యేక సమీక్షలు నిర్వహించిన తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ దిల్లీకి పయనమవుతారు.

About The Author