ఇడ్లీ పిండి కొంటే బకెట్ నీళ్లు ఫ్రీ..


ఇడ్లీ పిండి కొంటే ఒక బకెట్‌ నీరు ఉచితంగా ఇస్తామని తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ దుకాణ యజమాని ప్రకటించారు. ప్రస్తుతం నగరంలోని నీటి ఎద్దడి తీవ్రతకు ఈ ప్రకటన అద్దంపడుతోంది. ట్రిప్లికేన్‌ రాఘవేంద్ర ఆలయానికి సమీపంలోని ఎల్లయమ్మన్‌ దుకాణంవద్ద ఈ మేరకు సూచిక ఏర్పాటు చేశారు. దుకాణ యజమాని సీకేఆర్‌ గుప్తా మాట్లాడుతూ.. చాలామంది నీటికోసం గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోందని సిబ్బంది చెప్పారని, కిలో పిండి కొన్న వారికి బకెట్‌ నీరు ఉచితంగా ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చారన్నారు. వ్యాపారాభివృద్ధికి, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తన వంతు సాయం అందించేందుకు ఈ సలహా బాగుండటంతో ఇలా నీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ సేవను వినియోగించుకునే వారికి ముందుగా ఒక గుర్తింపు కార్డు అందించామని, ఆ కార్డుతో తమ దుకాణానికి వచ్చి పిండి కొన్నవారికి నీరు ఉచితంగా ఇస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు

About The Author