తిరుమల శ్రీవారిని అందాల నటి ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత దర్శించుకున్నారు. నిన్న రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన ఆమె, ఈ రోజు తెల్లవారుజామున సుభ్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సమంత తో పాటు దర్శకురాలు నందిని రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సమంత మీడియా తో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామివారి దగ్గరికి వస్తే చాలా మనశ్శాంతి గా ఉంటుందని అన్నారు. డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5వ తేది రిలీజ్ కానున్న హోబేబి సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, అమ్మను గౌరవించే సినిమా ఇది అన్నారు.. సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.

#SamanthaAkkineni

About The Author