అదుపుతప్పిన దుబాయ్ విమానం..


అదుపుతప్పి రన్ వే పై నుంచి పచ్చిక బయలు లోకి దూసుకేళ్ళిన దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం..

పైలట్‌ అప్రమత్తతతో నిలిపివేత.. 183 మంది సురక్షితం

బెంగళూరు : 183 మంది ప్రయాణికులతో రన్‌వేపై దిగిన విమానం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనున్న పచ్చిక బయలులోకి దూసుకుపోయింది. కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5.40 గంటలకు దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 380 విమానం రన్‌వే నుంచి మైదానంలోకి దూసుకుపోతుండటంతో అప్రమత్తమైన పైలట్‌ చాకచక్యంగా దాన్ని నిలిపివేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. ఎక్కడ తప్పు జరిగిందనేది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) విచారణలో తేలనుంది. 2010లో రన్‌వే నుంచి విమానం కిందకు వెళ్లి ప్రమాదానికి గురవడంతో 158 మంది మరణించారు.

About The Author