అహ్మదాబాద్‌లో ప్రారంభమైన రథయాత్ర! పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా దంపతులు!!


అహ్మదాబాదులో జగన్నాథుడి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, ఆయన భార్య సోనాల్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళహారతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ రథయాత్ర శ్రీ గుండీచా ఆలయం వద్ద పరిసమాప్తం కానుంది.
2.5కి.మీ వరకు జరిగే ఈ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగుతారు.
గుండీచా ఆలయానికి చేరుకున్న దేవతా మూర్తుల విగ్రహాలు..యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి జగన్నాథుడి ఆలయానికి చేరుకుంటాయి.
బహుడ యాత్ర పేరిట ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
అహ్మదాబాద్‌లో ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది.
మే మొదటి వారంలో గుజరాత్‌ను ‘ఫణి’ తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఏర్పాట్లు కాస్త కష్టమయ్యాయి.
ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
తొమ్మిది రోజులపాటు జరిగే ఈ యాత్రకు సుమారు 2లక్షల మంది వస్తారని అంచనా.
ఈ యాత్రకోసం 10 వేల మందితో భద్రతా చర్యలు చేపట్టారు.

About The Author