రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం…


ఈరోజు స్థానిక బిల్స్ హోటల్లో ఏపీ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి వామరాజు సత్యమూర్తి గారిని మర్యాద పూర్వకంగా కలిసి దృశ్యాలతో సన్మానించి ఆంధ్ర ప్రదేశ్ లో రజకుల ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి వివరించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒకే దేశంలో ఒకే వృత్తి చేస్తున్న రజకులను 2 రిజర్వేషన్ విధానంలో కొనసాగడం సరైనది కాదని దేశంలో ఓకే వృత్తి చేస్తున్న రజకులను ఓకే రిజర్వేషన్ కిందకి తీసుకొని రావాలని వినతిపత్రం అందజేయడం జరిగింది దీనికి సత్య మూర్తి గారు స్పందించి డిమాండ్ సరి అయినదే అని పార్టీలో చర్చించి ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది త్వరలోనే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నగంటి భాస్కర్ ఏపీ రజక జనసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య గారు ఏపీ రజక జనసేవ సంఘం చిత్తూరు జిల్లా యూత్ అధ్యక్షులు మల్లెమొగ్గల ఉమాపతి గారు. మురళి శేఖర్ హరి .శేఖర్ పాలకుంట. చౌడప్ప తదితరులు పాల్గొన్నారు

About The Author