జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ..


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం, పోలవరంతో పాటు పలు నీటి పారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశానంతరం మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు

About The Author