ఆర్థిక మందగమనం ప్రభావం క్రమంగా విస్తరిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి…


ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేకపోవడంతో హర్యానాలోని మారుతి సుజికి ఇండియా లిమిటెడ్ రెండు రోజుల పాటు తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది.

గురుగావ్, మనెసార్ ప్లాంట్‌ను ఈనెల 7, 9 తేదీల్లో మూసివేయనుంది. ‘నో ప్రొడక్షన్ డే’గా ఆ రెండు రోజులను ప్రకటించాలని నిర్ణయించింది.

ఉత్పత్తి నిలిపివేయడం వల్ల తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

About The Author