తిరుమల \|/ సమాచారం !!ఓం నమో వేంకటేశాయ!!

 ఈ రోజు మంగళవారం,   ఉదయం 6 గంటల   సమయానికి,తిరుమలలో భక్తుల రద్దీసాదారణం, స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 02  గదులలో భక్తులు  చేచియున్నారు,ఈ సమయం శ్రీవారి   సర్వదర్శనానికి సుమారు   06 గంటలు పట్టవచ్చును నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 2.45 కోట్లు,నిన్న 29,039 మంది   భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి    మొక్కులు తీర్చుకున్నారు నిన్న  73,714 మంది భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది, శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్   ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారి   దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయంపట్టవచ్చును,వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు   చేసిన కౌంటర్ ద్వారా  ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలుసుపథం మార్గం గుండా శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు  ఉ: 11 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు  దర్శనానికి అనుమతిస్తారు,శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_

_కావున లెమ్ము స్వామి_ 

ttd Toll free 18004254141

 

About The Author