చెన్నైలో లాన్సన్‌ టొయోటా డీలర్‌షిప్‌ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్య…


తీవ్రమవుతున్న అర్ధిక మాంద్యానికి మరోక వ్యాపారవేత్త,చెన్నైకార్ల డీలర్‌,అందునా మహిళ వ్యాపారవేత్త ఆత్మహత్య…
చెన్నైలో లాన్సన్‌ టొయోటా డీలర్‌షిప్‌ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం (50) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు రావడంవల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానిక నుంగంబాక్కం కొథారీరోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. లంక లింగం తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్‌ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపజేశారు.
కాగా.. బుధవారం రాత్రి నివాసానికి చేరుకున్న రీటా తన గదిలో నిద్రపోయారు. గురువారం ఉదయం 11 గంటల వరకు ఆమె గది నుంచి వెలుపలికి రాకపోవడం, గదిలో ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడగా రీటా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్‌ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. భర్తతో ఆమెకు గొడవలున్నాయా? లేక కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు ఏర్పడడంతో దిగులు చెంది ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

About The Author