పరాజయంతో పేట్రేగిపోతున్న టీడీపీ… వైసీపీ కార్యకర్త హత్య…


ఓటమిని గుణపాఠంగా మలచుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు దిగజారిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఒక్క స్థానాన్నీ గెలవలేకపోయిన టీడీపీ, ప్రజల నమ్మకాన్ని కోల్పోయి ప్రతీకార చర్యలకు దిగుతోంది. ప్రజల మధ్య కులాలు, వర్గాల పేరుతో చిచ్చు పెడుతోంది. ఈ పరిణామాలు తాజాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యకు దారితీశాయి.

పాచిపెంట మండలం మోసూరులో ఈ నెల 15వ తేదీన పశువుల కాపరి అయిన తవుడు సాయంత్రం ఆవులను కట్టిన తరువాత రాత్రి గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. నిమజ్జనం అయిన తరువాత అందరూ ఇళ్లకు చేరినా తవుడు ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం గ్రామంలోని స్థానిక శివాలయం సమీపంలో తవుడు మృత దేహాన్ని గుర్తించారు. మృతుడి కుడి చేయి విరిగి ఉండడం, మెడ నులిపిన ఆనవాళ్లు ఉండడంతో ఆయనను హత్య చేసినట్లుగా అనుమానించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. తవుడును గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి ఆరోపిస్తుండగా విచారణ చేపట్టిన పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

About The Author