శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వెఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సోమ‌వారం తెలంగాణ ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ‌. కె.చంద్ర‌శేఖ‌ర్‌రావును ఆహ్వానించారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రిని క‌లిసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన‌ప‌త్రిక‌ను, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, రాజ్య‌స‌భ ఎంపి శ్రీ వి.ప్ర‌భాక‌ర‌రెడ్డి, రాజంపేట ఎంపి శ్రీ పి.మిథున్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About The Author