ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్సై

ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగింది. ఏఎస్సై నరసింహ ఆత్మహత్యకు సమీపంలోని నీటి ట్యాంకు పైకి ఎక్కి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్సైను సహచరులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల బాలాపూర్‌ నుంచి మంచాల పీఎస్‌కు నరసింహను బదిలీ చేశారు. ఈ బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు.

 

 

About The Author