మర్రిచెట్టు గురించి సంపూర్ణ వివరణ


మర్రిచెట్టును సంస్కృతంలో వట , న్యగ్రోధః అని ఆంగ్లము నందు Banian tree అని పిలుస్తారు .
మర్రిచెట్టు సుప్రసిద్ధం అగు మహావృక్షం . వృక్షములలో ఇంతటి పెద్ద వృక్షం మరొకటి లేదు . పెరిగేకొద్ది కొన్ని ఎకరాల స్థలమును ఇది ఆక్రమించును. చెట్టంతయు జిగురు కలిగిన చిక్కటి పాలను కలిగి ఉండును. ఆకులు సమరేఖలు కలిగి కొన్ని గుండ్రముగా , కొన్ని కోలగా ఉండును. తొడిమ నార కలిగి పొడవుగా ఉండును. లేత ఆకు మృదువుగా , ముదిరినది పండినది పెళుసుగా ఉండును. ఇవి భూమిలో చొచ్చుకొని వేళ్లు పారి మానగును. పండ్లు పగడముల వలే ఎర్రగా ఉండును. పండులో సూక్ష్మ రూపంలో అసంఖ్యాక బీజములు ఉండును.
ఔషధోపయొగములు –
* ముందుగా రక్తం పడి ఆ తరువాత మలము పడు రక్తపిత్త రోగులకు కోలగా ఉండు చిగుళ్లు చిదగొట్టి పాలలో వేసి కాచి ఆ పాలను లోపలికి ఇచ్చిన ముత్ర, మల ద్వారముల నుంచి రక్తం కారటం తగ్గును.
* మర్రి చిగుళ్ళను మరియు గరిక చిగుళ్లను నూరి తేనెతో చేర్చి సేవించిన శరీరం నుంచి రక్తం బయటకి వెళ్లే రక్తపిత్త రోగం తగ్గును.
* మర్రి చిగుళ్లను , బూరుగు పైన బెరడు , ముత్తవ పులగం వేరు కలిపి మెత్తగా నూరి పైన లేపనం చేసిన వ్రణములు మానును .
* ముఖంపైన మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు మర్రిచిగుళ్ళు , చిన్న సెనగలు మెత్తగా నూరి పైకి లేపనం చేయుచున్న మంచి ఫలితం ఉండును. మర్రిచిగుళ్ల బదులు పండిన మర్రి ఆకు కూడా వాడవచ్చు .
* అతిసార వ్యాధితో బాధపడువారు మర్రిచిగుళ్లు బియ్యం కడుగుతో నూరి మజ్జిగతో తీసుకొనుచున్న అతిసార వ్యాధి తగ్గును.
* నోటిపూతతో ఇబ్బంది పడువారు లేత మర్రి ఊడలు చిదగగొట్టి నీటిలో వేసి కషాయం చేసి పుక్కిలించుచున్న నోటిపూతలు తగ్గును.
* దంతములు వదులుగా అయినచో మర్రి ఊడలతో పళ్లు తొముచున్న పళ్లు కదులుట, తీపులు తగ్గును.
* గజ్జి సమస్యతో ఇబ్బంది పడువారు మర్రిచిగుళ్లు , పసుపు కలిపి మెత్తగా నూరి పైన రాయుచున్న గజ్జి తగ్గును.
* రక్తముతో కూడిన వాంతులు అగుచున్న మర్రిపండ్లు పాలలో వేసి కాచి ఆ పాలను తాగిన రక్తవాంతులు తగ్గును. స్త్రీలలో కనిపించే ఎర్ర కుసుమ వ్యాధి తగ్గును.
* శుక్ల నష్టం ఆయ్యేఎప్పుడు మర్రిపండ్లను ఎండబెట్టి మెత్తగా చూర్ణం చేసి ఆ చూర్ణమును ఆవుపాలతో కలిపి నిత్యం సేవించుచున్న శుక్లనష్టములు తగ్గును.
* కాలిపగుళ్లతో ఇబ్బంది పడువారు మర్రిపాలను కాలిపగుళ్లలో ప్రతినిత్యం నింపుచున్న కాలిపగుళ్ళు త్వరగా మానును .
* ఆహారములో విషదోషాలు హరించు శక్తి మర్రిఆకులతో చేసిన విస్తరికి కలదు.
* నడుమునొప్పితో ఇబ్బంది పడువారు పలచని నూలుబట్టను మర్రిపాలతో తడిపి వెంటనే రోగి నడుముకి అంటించాలి . అది బాగా అతుక్కిపోతుంది ఈ విధంగా రెండుమూడు పట్టీలు వేస్తే ఎంత బాధాకరం అయిన నడుమునొప్పి అయినా తగ్గును.
* అతిమూత్రంతో ఇబ్బంది పడువారు బెత్తెడు ముక్క నలగ్గొట్టి పెద్ద గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం సగం గ్లాసు వచ్చేంతవరకు మరిగించి వడకట్టి చల్లార్చి తాగుతుంటే అతిమూత్రవ్యాది తగ్గును.
* పిప్పిపన్ను సమస్యతో ఇబ్బంది పడువారు మర్రిపాలను దూదితో తడిపి పుప్పిపన్ను రంధ్రములో ఉంచితే వెంటనే పురుగు చచ్చి కిందకు పడును .
* చెవిలో పురుగులు దూరి ఇబ్బంది పడుతున్న ముందుగా మేకపాలు 5 చుక్కలు చెవిలో వేసి మర్రిపాలు నాలుగు చుక్కలు వేస్తే చెవిలో దూరిన పురుగులు నశించిపోవును .
* మాటలు రాని చిన్నపిల్లలకు లేత మర్రి ఊడలు మెత్తగా నూరి ఆ గంధాన్ని నాలిక పైన రాయుచున్న చిన్నపిల్లలకు మాటలు వచ్చును.
* మధుమేహముతో ఇబ్బంది పడువారు మర్రిచెట్టు బెరడు చూర్ణం ఒక టీస్పూను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగుచున్న మధుమేహం అదుపులోకి వచ్చును.

About The Author