గ్రామసభల్లో చర్చలను ఇకపై రాసే అవసరం లేదు…
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ(ఏఐ) టూల్ వాటిని చిటికెలో డాక్యుమెంటేషన్ చేయనుంది.
గ్రామసభ వీడియోలను ఇందుకు సంబంధించిన ‘సభాసార్’ పోర్టల్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డాక్యుమెంట్ ని తీర్మానం కింద పంచాయతీల్లో భద్రపరుచుకోవచ్చు.
ఈ ఆధునిక సాంకేతికతను గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి పంచాయతీలో సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని సర్పంచి టి.రామకృష్ణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి తీర్మానించారు.
అనంతరం గ్రామసభ వీడియోను పోర్టల్లో అప్లోడ్ చేయగా ఏఐ టూల్ డాక్యుమెంటేషన్ చేసింది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లోనూ దశల వారీగా ఇదే విధానం అమలు చేయనున్నారు.
ఇదే గ్రామంలో స్వామిత్వ పథకంలో 708 కుటుంబాలకు గ్రామకంఠాల్లోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై హక్కులు కల్పించిన విధానాన్ని సమిత్వ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.నిషాంత్రెడ్డి మీడియాకు వివరించారు.