దర్శనం, సేవా టికెట్లు, వసతి పేరుతో భక్తులను మోసం చేసిన టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్

తిరుపతి 2026 జూలై 14,తిరుమలలో శ్రీవారి దర్శనం, శ్రీవాణి, తోమాల సేవ, సుప్రభాత సేవ, వీఐపీ దర్శనం, గెస్ట్ హౌస్ వసతి కల్పిస్తానని భక్తులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న తిరుపతికి చెందిన టీటీడీ మాజీ ఉద్యోగి *టి. అరుణ్ కుమార్ (26)*ను తిరుపతి టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో నిందితుడు గతంలో టీటీడీ ఉద్యోగం నుంచి తొలగించబడినట్లు, 2023లో కూడా ఇదే తరహా మోసాల కేసులో అరెస్టైనట్లు తేలింది. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి బ్యాంకు ఖాతాల్లో గత ఏడాది కాలంలో సుమారు రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.99,000 నగదు, మూడు బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.

– భక్తులకు విజ్ఞప్తి.

దర్శనం, సేవలు, వసతి పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, అధికారిక కౌంటర్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మరియు టీటీడీ సీవీ&ఎస్‌వో శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, మోసగాళ్లు ఇతరుల బ్యాంకు ఖాతాలను “మ్యూల్ అకౌంట్స్”*గా వినియోగిస్తున్నారని తెలిపారు. “మీ ఖాతాలో డబ్బు జమ చేసి మరొకరికి పంపండి” వంటి అభ్యర్థనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About The Author