థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి కఠినమైన ఆదేశాలు..

వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకొని వెహికల్స్ కు పెట్రోల్ గాని డీజిల్ గాని పట్టకూడదని ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోని వాహనాలు 16 కోట్ల 54 లక్షలు ఉన్నాయని చెప్పింది. మొత్తం 30 కోట్ల 48 లక్షల వాహనాల్లో సగానికి పైగా వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే తిరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన నిబంధనలను అమలు చేయాలని కోరింది. జాతీయ రహదారుల మీద తరచూ ప్రమాదాలు జరగడం దానివల్ల ట్రాఫిక్కు కిలోమీటర్ల తరబడి స్తంభించడం , ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుందని సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది . రోడ్లపై తిరుగుతున్న 56 శాతం వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే తిరుగుతున్నాయని ఈ మేరకు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం దృష్టికి తెచ్చారు.
