భర్తకు రోజు మత్తుమందు పెట్టి ప్రియుడుతో సరసాలు…

అర్థరాత్రి ఆడది ఒంటరిగా వీధిలో నడిచిపోయిన రోజే ఈ దేశానికి స్వతంత్రం అన్న మాట ఎలా ఉన్నా పెళ్లయిన పదో రోజు నుంచి భర్తకు మత్తు మాత్రలు ఇచ్చి, నిద్రపుచ్చి అర్ధరాత్రి ప్రియుడిని నేరుగా తన బెడ్ రూమ్ లోకి పిలిపించుకొని సరసలాడిన ప్రియురాలు మాత్రం గుండెలు తీసిన ఆడదే.. సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటన జరిగిందని చెపితే నమ్మరు. సినిమా తీసిన నమ్మరు
. కానీ 8 మంది పోలీసులు సాక్షిగా పెద్దమనుషుల సాక్షిగా రాత్రి ఒంటి గంటకి తన ఇంట్లోనే పక్కగదిలో అత్తమామలు ఉండగానే బెడ్ రూమ్ లోకి దూరిన ప్రియుడిని భర్త పట్టించాడు. ఇద్దరూ నగ్నంగా ఉన్న దశలోనే పట్టించాడు. ఇద్దరినీ బట్టలు కట్టించి పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. పెళ్లయిన తర్వాత రెండు వారాల నుంచి భర్తకు ఎందుకో అనుమానం వచ్చింది. పగలు ఒళ్లంతా అన్నినీరసంగా ఉండడం, పగలు పనిచేసుకోలేక పోవడం ఎందుకు ఇలా అవుతుందని బాధపడేవాడు. ఈ లోగా పగటిపూట ఆమె నిత్యం సెల్ఫోన్లో చాటింగ్ చేయడం మాట్లాడుకోవడం చూసి కూడా అనుమానం వచ్చింది.
ఓ రోజు తన చిన్నాన్న చనిపోవడంతో పక్క ఊరికి వెళ్లి రాత్రి ఒంటిగంటకు వచ్చే సమయంలో ఇంట్లో ప్రియుడుతో భార్య తన బెడ్ రూమ్ లోనే సరసాల్లో ఉంది . వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు . గత నెల రోజులుగా రోజు ఈ కార్యక్రమం జరిగిపోతుందని కొత్త పెళ్లికూతురు కూడా ఒప్పుకుంది. తాను ప్రియుడిని వదిలి ఉండలేనని పోలీసులు వదిలేస్తే ఇద్దరం వెళ్ళిపోతామని కూడా ధైర్యంగానే చెప్పింది. ఇంతకీ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ పరిధిలో చర్గవ్ లో జరిగింది..
