మోదీ హిందువుల కోసం ఏం చేశారు?


“మోదీ హిందువుల కోసం ఏం చేశారు?” అనే ప్రశ్నకు సమాధానమే ఈ భారత్ మండపం… ఆ సనాతన విందు!

​నా ప్రియమైన మిత్రులారా, వినండి…
​ఇది కేవలం ఒక విందు మాత్రమే కాదు, ఇదొక బహిరంగ ప్రకటన… ప్రపంచానికే విసిరిన ఒక సవాలు!

​ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ దేశాల నాయకుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన అధికారిక విందులో 100% శాకాహార భోజనాన్ని మాత్రమే వడ్డించారు. స్వచ్ఛమైన సనాతన భోజనం!

​అసలు అక్కడ కూర్చున్నది ఎవరో తెలుసా?
ప్రపంచ మొత్తం సంపదలో (జీడీపీలో) 40% పైగా వాటా కలిగిన అగ్రరాజ్యాల అధినేతలు. వీటో పవర్ ఉన్న, నిత్యం మాంసాహారమే భుజించే దేశాల నాయకులు!

​బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా… ఇలా పూర్తిగా మాంసాహార ప్రియులైన దేశాధినేతలందరికీ మోదీ వడ్డించింది స్వచ్ఛమైన సనాతన భోజనం!
​అదీ ఎక్కడ?

భారత్ మండపం ఎదుట ప్రతిష్టించిన 28 అడుగుల భారీ నటరాజ విగ్రహం సాక్షిగా! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ స్వామి సమక్షంలో!

​1. శాకాహారమే ఎందుకు?
ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం కాదు, అధికార దర్పానికి నిదర్శనం! “మీరు మీ టేబుల్ వద్ద కాదు, నా టేబుల్ వద్ద కూర్చున్నారు… ఇక్కడ నడిచేది నా నిబంధనలే!” అని మోదీ ప్రపంచానికి చాటిచెప్పారు. హలాల్ సర్టిఫికేషన్ ద్వారా ప్రపంచ ఆహార మార్కెట్‌పై రుద్దుతున్న బానిసత్వ సంస్కృతిపై మోదీ సంధించిన మొదటి బ్రహ్మాస్త్రం ఇది. ఇకపై ప్రపంచ క్రమం సనాతన జీవనశైలితోనే సాగుతుందని స్పష్టం చేశారు.

​2. ఈ ప్రత్యేక మెనూ ఎందుకు?
ఇవి కేవలం వంటకాలు కావు, సమగ్ర భారత సాంస్కృతిక స్వరూపం! ‘ట్రెడిషన్ టు టేబుల్’ (సంప్రదాయం నుండి భోజన బల్ల వరకు) అనే నినాదంతో, మన తల్లుల ప్రాచీన వంటల పద్ధతుల స్ఫూర్తితో రూపొందించిన విశిష్ట వంటకాలివి. హలాల్ వ్యాపారుల ప్రయోజనాల కోసం సాంప్రదాయ వంటలను కించపరిచే వారికి ఇది గట్టి సమాధానం!

​3. ఈ బహుమతులే ఎందుకు?
విందు పూర్తయిన తర్వాత ప్రపంచ నేతలకు బహుమతిగా ఏమిచ్చారో తెలుసా? భారత ప్రాచీన వారసత్వ జ్ఞాన భాండాగారాలైన ‘భగవద్గీత’, ‘తిరుక్కురళ్’. చేతికి ఆయుధాలు ఇవ్వలేదు, అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు. ఇదీ మన సనాతన ధర్మం!

​ఆ 28 అడుగుల నటరాజ విగ్రహం వెనుక ఉన్న విశేషం:
​భారత్ మండపం ముందు ప్రతిష్టించిన ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం 28 అడుగుల ఎత్తు ఉంది. తమిళనాడులోని స్వామిమలైకి చెందిన రాధాకృష్ణన్ స్థపతి నేతృత్వంలోని నిపుణుల బృందం దీనిని రూపొందించింది. ప్రాచీన చోళుల శైలిలో అష్టధాతువులు — బంగారం, వెండి, రాగి, జింక్ (యశదం), సీసం, తగరం, ఇనుము, పాదరసం — అనే 8 లోహాల మిశ్రమంతో దీనిని నిర్మించారు.

​ఎందుకు సరిగ్గా 28 అడుగులు?
భారత్ మండపం అనే భారీ కన్వెన్షన్ సెంటర్ ముందు ఎంత దూరం నుంచి చూసినా సరైన నిష్పత్తిలో, అత్యంత గంభీరంగా కనిపించడానికి. శిల్పశాస్త్ర నిబంధనల ప్రకారం 22 అడుగుల విగ్రహానికి 6 అడుగుల పీఠం అమర్చి ఈ శాస్త్రీయ వైభవాన్ని అందించారు.
​దీనిని ‘లాస్ట్-వ్యాక్స్ కాస్టింగ్’ (మధుచ్ఛిష్ట విధానం) అనే 6,000 ఏళ్ల నాటి ప్రాచీన భారతీయ సాంకేతిక పద్ధతిలో తయారు చేశారు.

సింధు లోయ నాగరికత నాటి ప్రసిద్ధ ‘నాట్యగత్తె కాంస్య విగ్రహం’, పురాతన చోళుల విగ్రహాలు కూడా ఇదే పద్ధతిలో రూపుదిద్దుకున్నాయి. ఈ విధానంలో విగ్రహం పూర్తయ్యాక మట్టి అచ్చును పగులగొడతారు, కాబట్టి ప్రపంచంలో ఇలాంటి రెండవ విగ్రహాన్ని మళ్లీ తయారు చేయడం అసాధ్యం!

​చివరిగా…

​ఒకప్పుడు “నేను హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను” అనే వికృత భావజాలం ప్రచారంలో ఉన్న దేశంలో… నేడు “నేను హిందువునని సగర్వంగా చెబుతున్నాను”, “భగవాన్ నటరాజ స్వామి నా ఆరాధ్య దైవం, సనాతన ధర్మమే నా ప్రాణం” అనే సందేశాన్ని మోదీ ప్రపంచానికి చాటారు.
​చూసి నేర్చుకోండి… ఇతరులు ఏమనుకుంటారోనని పెళ్లిళ్లలో, గృహప్రవేశాల్లో, పురిటి వేడుకల్లో, చివరకు తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మల్లో కూడా ఇతర సంస్కృతుల పేరిట మాంసాహారాన్ని వడ్డించేవారు మన ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలి.

​”మోదీ హిందూ సమాజం కోసం ఏం చేశారు?” అని ప్రశ్నించేవారికి…
​హిందువు అంటే ద్వితీయ శ్రేణి పౌరుడు అనే ఆత్మన్యూనతా భావాన్ని తుడిచిపెట్టి, “సనాతన ధర్మం ప్రపంచానికే మార్గదర్శి” అనే స్వాభిమానాన్ని నింపారు మోదీజీ. కోల్పోయిన ఆత్మబలాన్ని, అణచివేయబడ్డ ఆత్మాభిమానాన్ని తిరిగి నింపి, పాతకాలపు విషపూరిత ఆలోచనలను పటాపంచలు చేయడానికి ఈ ఒక్క విందు నిదర్శనంగా నిలిచింది.

​ఈ సనాతన భోజనం వడ్డించడాన్ని తప్పుబడుతున్న ప్రతిపక్ష నేతలకు ఒక్కటే చెప్పాలి…

“బంగారం కరిగించే చోట పిల్లికేం పని?”
దేశ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నిర్ణయించడానికే 140 కోట్ల మంది ప్రజలు మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారు… మీరు కేవలం ప్రతిపక్షం మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోండి!

​గుండెల నిండా గర్వంతో మన మోదీజీకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటారా?
ఆయన కేవలం భోజనం వడ్డించలేదు, భారతీయ ఆత్మను వడ్డించారు! బానిసత్వ సంకెళ్లను తెంచి, జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టారు!

​నా అంతరాత్మ సగర్వంగా చెబుతోంది
— “నేను హిందువును… నేను సగర్వ హిందువును!”

About The Author