ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్‌లు కలకలం…ఇద్దరు అధికారులు సస్పెండ్…

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి ఎస్. చిన్న రాముడు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పి. విద్యా సాగరుడుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఆత్మకూరు ఆర్డీవో, ఎమ్మార్వోలుగా ఉన్న చిన్న రాముడు, విద్యా సాగరుడు పనిచేస్తున్నారు. కాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో పోలింగ్ ముగిసిన తర్వాత 115వ పోలింగ్ బూత్ స్లిప్పులు కలకలం రేపాయి. వీవీ ప్యాట్ స్లిప్పులు బయటకి రావడంతో పాటు తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్లిప్పులు బయటికి వచ్చాయని అధికారులు నిర్దారించారు. సీఈసీ ఆదేశాలతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

About The Author