ఐపియల్ మ్యాచ్ లపై బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్…

 


ఓబులవారిపల్లి మండలం పరిధిలోని బొంతవారిపల్లె చర్చి సమీపంలో మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఐపియల్ మ్యాచ్ లపై బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని యస్. ఐ మోహన్ ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకోవడం జరిగింది. ఈ దాడిలో 14,00,450/- ల రూపాయలు, 3 సెల్ ఫోన్ లు, 4 క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన స్లిప్ లు దోరికాయని తెలిపారు. డియస్పి మురళి, సిఐ బాలయ్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బెట్టింగ్ ఆడిన షేక్ మౌలానా(చిన్న ఓరంపాడు), అనపాటి వెంకటరమణ (చిన్న ఓరంపాడు), కటికం వీరప్పగారి నాగేంద్ర ల పై cr.no.91/19,సెక్షన్ 353,34 ipc మరియు సెక్షన్ 9(1) ap gaming act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గా తెలిపారు

About The Author