తల్లి వివాహేతర సంబంధం చుాడలేక… తల్లిని-ప్రియుడిని నరికి చంపిన కొడుకు.

https://m.facebook.com/story.php?story_fbid=398049364118411&id=266763133913702

జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల శివారులో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతలో కలకలం సృష్టించింది.

జోగులాంబ గద్వాల్ జిల్లా లోని అలంపూర్ తాలూకా రాజోలి మండల శివారులో BT రోడ్ పక్కన్నే పట్టపగలు శంకరమ్మ ,తెలుగు బడేసాబ్ అనే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు.వీరిద్దరూ కూడా కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. కాగా బడేసాబ్ అలువాల గ్రామస్థుడు, శంకరమ్మ గుండ్రేవుల గ్రామస్థురాలు. అయితే వీళ్ళిద్దరికి ఎంతో కాలంగా అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. వీరు నిన్న వారి సొంత గ్రామాల్లో నుండి బయలుదేరి బయటకు వచ్చారు, గురువారం వొడ్డపల్లి మండలం శాంతినగర్ నుండి ఆటో ఎక్కి తిరిగి వారి సొంత గ్రామాలకు ఆటోలో వెళ్తుండగా శంకరమ్మ కొడుకు రాముడు మోటార్ సైకిల్ పై వెనుక వస్తు రాజోలి మండల శివారు సమీపంలో ఆటో ఆపి వారిద్దరిని దింపి పదునైన ఆయుధంతో కొట్టి ఇద్దరినీ పట్టపగలే హత్య చేసి పారిపోయాడు. వీరి హత్యకు కారణం శంకరమ్మ, బడేసాబ్ ల మధ్య ఉండే అక్రమ సంబంధమే అని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న రాజోలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శాంతినగర్ CI పరిధిలో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author