ఎన్నాళ్లో వేచిన ఉదయం…కాళేశ్వరం ప్రాజెక్టు….


ఈ క్షణం కోసం ఎన్నేండ్ల ఎదురుచూపులు! తలాపున గోదారమ్మ పారుతున్నా.. పక్కనే ఉన్న పొలాలకు తడి అందని పరిస్థితి. బోర్లు వేస్తుంటే.. నీళ్లు పడకున్నా.. కనీసం పదును కనిపించినా చాలనుకున్న సందర్భాలు ఎన్నో! బోర్లల్లో ఒక్కచుక్క కూడా అందక.. వానలకోసం మబ్బులవైపు చూస్తూనే ఉసురు పోయిన ఘటనలు ఎన్నో! బోర్లు.. కరంటు.. తెలంగాణ అన్నదాతల పాలిటి యమపాశాలయినాయి. నియతిలేని పాలకులకు ఎన్నడూ కండ్లల్లో తడారిపోయిన తెలంగాణ రైతు కనిపించలేదు. ఉద్యమనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత తప్పదన్నట్టుగా ఉమ్మడి పాలకులు ఉత్తుత్తిగా వేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు శంకుస్థాపన రాయి ఎక్కడున్నదో కూడా తెలియదు. కానీ.. తెలంగాణ సాధించిన ఉద్యమనేతే.. రాష్ట్ర పాలకుడై గోదారమ్మను తెలంగాణ పొలాలకు తరలించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకొని.. ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ వస్తే ఏమైతది అన్నవాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు నిటారుగ నిలబడి నినదిస్తున్నది.. ఇదిగో తెలంగాణమని!

About The Author