అర్ధకుంభమేళా :


2019 జనవరి 15 మంగళవారం సంక్రాంతి నుండి 49 రోజులపాటు మార్చి 4 మహాశివరాత్రి వరకు జరుగును.

వివరణ :
కుంభము అంటే కుండ లేదా కలశము అనిఅర్ధము.
మేళా అంటే కలయిక, కూటమి అనిఅర్ధము. ఈ కుంభమేళా గురుంచి భాగవతము,మహాభారతము,రామాయణము,విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది.

క్షీరసాగra మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం : అలహాబాద్,
హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయి. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు. 6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే  కుంభమేళాన్న అర్ధకుంభమేళ అని, 12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. 12 పూర్ణ కుంభమేళాలు 12*12= 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభ మేళాఅంటారు.

2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరము కొన్ని పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. గురుడు ఏరాశిలో ప్రవేశిస్తే ఆనదికి పుష్కరము వస్తుంది. పుష్కరము అంటే 12 సంవత్సరాలు అనిఅర్ధము.

ఈసారి గురుడు ధను రాశిలో ప్రవేసిస్తున్నాడు. కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు ప్రారంభము అగును. ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్దజరుగుతాయి.

ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షలమంది అఘోరాలు, సాధువులు స్నానము ఆచరిస్తారు.

కుంభమేళాలో ముఖ్యమైన రోజులు :

జనవరి 15 మంగళవారం రాజ స్నానము.

జనవరి 21 సోమవారం పుష్య పౌర్ణమి.

ఫిబ్రవరి 4 సోమవారం మౌని అమావాస్య.

ఫిబ్రవరి 9 శనివారం శ్రీపంచమి.

ఫిబ్రవరి 19మంగళవారం వ్యాసపూర్ణిమ,మాఘపూర్ణిమ.

మార్చి 4 సోమవారం మహాశివరాత్రి.

అర్ధకుంభమేలా , ప్రయాగరాజ్ 2019

కుంభమేలా అనగానే నాగాసాధువుల స్నానాలు, వాళ్ళు చేసే విన్యాసాలు గుర్తుకువస్తాయి. ఈ కుంభమేలా 15 జనవరినాడు 13 అఖాడాలనుండీ వచ్చే సాధువుల స్నానాలతో ప్రారంభమౌతుంది. అఖాడా అనే పదానికి అర్థం మల్లయుద్ధవేదిక. ఆంగ్లంలో arena అంటారు. మనవైపు వ్యాయామకళాశాలలో మల్లయుద్ధం చేసే స్థలాలవంటివన్నమాట. ఎక్కడ , ఎప్పుడు కుంభమేళా జరిగినా ఈ 13 అఖాడాలసాధువులు వెళ్ళి మొదటగా స్నానం చేయడం ఆనవాయితీ. వాళ్ళు ఎవరో చూద్దాం.

1. జూనాఅఖాడా
దీని ప్రధానకార్యాలయం కాశీలో ఉంది. ఇందులో సుమారు 4 లక్షల సాధువులు ఉన్నారు. ఇదే అతిపెద్ద అఖాడా. వీరి ఇష్టదైవం దత్తాత్రేయుడు. ఇందులో మహిళా సాధ్వీమణులు కూడా ఉన్నారు. వీరికి నివాసం (మాయీబాడా) విడిగా ఉంటుంది. ఇందులో ఎంతోమంది విదేశీ సాధువులు కూడా ఉండటం విశేషం.

2.అటల్_అఖాడా
వీరి ఇష్టదైవం గణపతి. ఇందులో సుమారు 700 మంది సాధువులున్నారు. దీని ప్రధాన కార్యాలయం కూడా కాశీలోనే ఉంది. ఇందులో మహిళలు ఉండరు. వీరు “బల్లెం” ను ఆయుధంగా పూజిస్తారు. ఆబల్లెంనకు ‘సూర్యప్రకాశ్ ‘ అనిపేరు. వీరివద్ద ధర్మధ్వజం, పర్వధ్వజం అనే 2 జెండాలుంటాయి. కుంభమేళాలో ధర్మధ్వజం తో ప్రవేశించి , పర్వధ్వజంతో స్నానం చేస్తారు.

3.ఆనంద్_అఖాడా
ఇది కూడా కాశీలోనే ఉంది. వీరి ఇష్టదైవం సూర్యభగవానుడు.

4.ఆహ్వాన్_అఖాడా
ఇది కాశీలోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద ఉన్నది. గణపతి వీరి ఇష్టదైవం. ఇందులో సుమారు 12,000 మంది సాధువులున్నారు. ఇందులోకూడా ‘బల్లెం’ ను పూజిస్తారు.

5.నిరంజనీ_అఖాడా
వీరి ఇష్టదైవం కార్తికేయుడు. గాయత్రీదేవి మరియు అగ్నిదేవుడు వీరి ఇష్టదైవాలు.
ఇది ప్రయాగరాజ్ లోనే ఉంది. ఇందులో సుమారు 10,000 మంది సాధువులున్నారు.

6.మహానిర్వాణీ_అఖాడా
ఇది కూడా ప్రయాగరాజ్ లోనే ఉంది. వీరి ఇష్టదైవం కపిలముని. ఇందులో సుమారు 6,000 మంది సాధువులున్నారు. వీరికి కూడా రెండురకాల ధ్వజాలున్నాయి.

7.పంచాగ్ని_అఖాడా
ఇది కాశీలో ఉంది. ఇందులోకూడా అగ్నిని, గాయత్రీదేవిని పూజిస్తారు. సుమారు 3,000 మంది సాధువులున్నారు.

8.దిగంబర_అఖాడా
వీరి ఇష్టదైవం బాలానందస్వామి. ఇందులో మహిళలు ఉండరు.

9.నిర్మోహీ_అఖాడా
రామానందాచార్య దీనిని స్థాపించారు. హనుమంతుడు వీరి ఇష్టదైవం. ఇందులో సుమారు 15,000 మంది సాధువులున్నారు.

10.నిర్వాణీ_అఖాడా
వీరి కార్యాలయం అయోధ్య లో ఉంది. ఇష్టదైవం హనుమంతుడు. వీరంతా ఊర్ధ్వత్రిపుండ్రం ధరించి ఉంటారు.

11.పంచాయతీ_బడా_ఉదాసీన్_అఖాడా
ఉదాసీన సంప్రదాయవాదులైన వీరు పంచాయతన దేవతలను పూజిస్తారు. ఇందులో 20,000 మంది సాధువులున్నారు. కార్యాలయం ప్రయాగరాజ్ లోనే ఉంది.

12.పంచాయతీ_నయా_ఉదాసీన్_అఖాడా
ఉదాసీన సంప్రదాయవాదులైన వీరి కార్యాలయం హరిద్వార్ లోని కనఖల్ లో ఉంది. వీరు సుమారు 5,000 మంది ఉన్నారు. వీరుకూడా పంచాయతన దేవతలను పూజిస్తారు.

13.నిర్మల్_అఖాడా
సిక్కు సంప్రదాయంతో ముడివడిన ఈ అఖాడాను గురుగోవింద్ సింగ్ మిత్రుడైన వీరసింహుడు స్థాపించాడు. ఇది హరిద్వార్ లో ఉంది. ఇందులో మహిళాసాధంవులుండరు. వీరు గురుగ్రంథ్ సాహెబ్ ని పూజిస్తారు.

About The Author