పిడుగుపాటుకు గురై ఏడుగురు చిన్నారులు మృత్యువాత…


బిహార్‌లో పిడుగుపాటుకు గురై ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. సెంట్రల్‌ బిహార్‌ జిల్లా నవాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కొందరు పిల్లలు చెట్టు కింద ఆడుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు పరుగు పరుగున సంఘటనా స్థలానికి వచ్చారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకూ ఆడుకుంటూ విగతజీవులుగా మారిన పిల్లలను చూసి, వారి తల్లిదండ్రులు, బంధుల రోదనలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది

About The Author