దిమ్మదిరిగే నిజాన్ని బయటపెట్టిన పాక్ ప్రధాని…

 

 

 

 

 

 

 

 

 

 

 

పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. పాకిస్థాన్ లో ఉగ్ర సంస్థలు వేళ్లూనుకుని ఉన్నాయనే నిజాన్ని ఎట్టకేలకు ఇమ్రాన్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. పాక్ గడ్డపై నుంచి 40 ఉగ్ర సంస్థలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ చేదు నిజాన్ని గత 15 ఏళ్లుగా అమెరికాకు పాకిస్థాన్ చెప్పలేదని అన్నారు.

ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికాతో కలసి తాము పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అమెరికాలోని ట్విన్ టవర్లను (9/11 అటాక్) ఉగ్రవాదులు కూల్చిన ఘటనతో పాకిస్థాన్ కు సంబంధం లేదని, ఆ దాడికి పాల్పడిన ఆల్ ఖైదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉందని చెప్పారు. పాకిస్థాన్ లో తాలిబాన్లు లేకపోయినప్పటికీ… అమెరికా చేస్తున్న యుద్ధంలో తాము కూడా చేతులు కలిపామన్నారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని గతంలో అమెరికా అడిగింది:
పాకిస్థాన్ లో 40 ఉగ్ర సంస్థలు పని చేస్తున్నాయని… దీనిపై తనలాంటి ఎందరో పాకిస్థానీలు తీవ్ర ఆందోళన చెందామని… మనం బతకగలమా? అని భయపడ్డామని ఇమ్రాన్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని గతంలో అమెరికా అడిగిందని… కానీ, అప్పుడు పాకిస్థాన్ సొంత మనుగడ కోసం పోరాడుతోందని పేర్కొన్నారు. అమెరికాతో పాకిస్థాన్ అనుబంధం పరస్పర నమ్మకాల ఆధారంగా ఉండాలని ట్రంప్ కు తాను చెప్పానని ఇమ్రాన్ అన్నారు.

శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ ఏం చేయబోతుందో ట్రంప్ కు వివరించానని పేర్కొన్నారు. తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు కృషి చేస్తున్నానని… ఇప్పటి వరకైతే తాము కొంత సాధించామని… అయితే, ఇది అనుకున్నంత సులభం కాదనే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశానని చెప్పారు. ఎందుకంటే ఆప్ఘనిస్థాన్ లో ఇది అత్యంత క్లిష్టమైన పని అని తెలిపారు. శాంతిని నెలకొల్పే విషయంలో యావత్ దేశం, పాక్ ఆర్మీ తన వెనుక ఉన్నాయన్నారు.

About The Author