అక్టోబర్ 2 నుంచి రాజన్న పేరుతో అన్న క్యాంటీన్లు ప్రారంభం


ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన “అన్నాక్యాంటీన్లు” వైఎస్సార్ పేరుతో అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.

జులై 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను గతంలోని చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసింది. 5 రూపాయలకే పేదవారికి ఈ క్యాంటీన్లలో భోజనం లభించేది. వీటి మూసివేత వలన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది.

అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి. ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. వీటిని సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది

About The Author